వెండితెరపై విలన్గా పేరు తెచ్చుకున్న సోనూసూద్ లాక్డౌన్ కారణంగా ఒక్కసారిగా హీరో అయిపోయాడు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో వలస కూలీలు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వారు పడుతున్న బాధల్ని గమనించిన సోనూసూద్ ప్రభుత్వాలకు పూర్తి భిన్నంగా నేనున్నానని స్పందించి వారిలో ఆత్మస్టైర్యాన్ని కలిగించారు. వారి పట్ల దేవుడిలా మారిపోయారు.
ఎక్కడ కష్టం అంటే అక్కడ తానున్నానని ముందుకొచ్చి సాయం చేశారు. రైళ్లు, బస్సులు, విమానాల్లో వలస కూలీలని గమ్యస్థానాలకు చేర్చి వారికి నమ్మిన దైవంగా నిలిచారు. దీంతో ఎక్కడ చూసినా దేశ వ్యాప్తంగా సోనూ సూద్ పేరు మారుమ్రోగిపోయింది. సాయం అని తనకు ఫోన్ చేసిన వారికి అండగా నిలిచి వారి కోసం తన ఆస్తుల్ని సైతం తాకట్టుపెట్టేందుకు వెనుకాడని నైజం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా సోనూసూద్ హైదరాబాద్ బేగంపేట్లోని తన పేరు పై ఓ అభిమాని ప్రారంభించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు సోనూసూద్.
తన అభిమానిని సర్ప్రైజ్ చేశారు. బేగం పేట్కు చెందిన అనిల్ అనే వ్యక్తి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని రన్ చేస్తున్నారు. సడన్గా తన అభిమాన నటుడు తన వద్దకు రావడంతో అనిల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోనూ రాకని గమనించిన స్థానికులు అతనికి స్వాగతం పలికి పూలమాలతో సత్కరించి ఆనందించారు. అక్కడే సోనూసూద్ టిఫిన్ కూడా చేయడం విశేషం.