మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని ఈ ఏడాది మొదలుపెట్టి షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ లేట్ గా మొదలైనా ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని సూపర్ స్పీడ్ తో అవ్వగొట్టాలని కొరటాల శివ నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. జూన్ లేదా జులై కల్లా మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. టాకీ పార్ట్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో మొదటి నుండి రామ్ చరణ్ ను స్పెషల్ రోల్ కు అనుకోగా ఇప్పుడు ఆ స్థానంలో మహేష్ బాబు వచ్చి చేరిన విషయం తెల్సిందే. ఈ రోల్ కోసం మహేష్ భారీ పారితోషికాన్ని అందుకోనున్నాడు. 30 రోజుల కాల్ షీట్స్ కోసం దాదాపు 25 కోట్ల దాకా మహేష్ కు ముడుతున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపుగా రోజుకి కోటి దాకా అందుకుంటున్నాడు. ఈ రేంజ్ లో పారితోషికం అందుకునే నటుడు తెలుగు ఇండస్ట్రీలోనే లేడేమో.
ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. సోను సూద్ తెలుగువారికి కూడా పరిచయస్తుడే. ఇక్కడ టాప్ హీరోల సినిమాల్లో విలన్ వేషాలు బానే వేసాడు. అయితే ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గించిన సోను సూద్ మళ్ళీ మెగాస్టార్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో నటిస్తుండడం పట్ల చాలా గర్వంగా ఉందని సోను సూద్ ప్రకటించాడు. చిరంజీవితో కలిసి నటించడాన్ని ఆస్వాదిస్తున్నా అని తెలిపాడు. సౌత్ ఇండస్ట్రీ నా పట్ల చాలా దయ చూపించింది అంటూ ఎమోషనల్ అయ్యాడు కూడా.
ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించనుండగా మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ మూడో వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.