లాఖ్డౌన్ 30 రోజులు పూర్తయింది. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్టార్స్ అంతా ఇంటికే పరిమితమైపోయారు. నిత్యం వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీగా గడిపేసే స్టార్లు ఇప్పుడు షూటింగ్లు లేకపోవడంతో గత 30 రోజులుగా ఇంటి పట్టునే వుంటున్నారు. పిల్లలతో ఫ్యామిలీతో క్వారెంటైన్ టైమ్ని గడిపేస్తున్నారు.
పిల్లల్లో నూతనోత్తేజాన్ని కలిగిస్తున్నారు. సూపర్స్టార్ మహేష్ లాక్డౌన్ ప్రకటించిన దగ్గరి నుంచి ఇంటి పట్టునే వుంటున్నారు. బయట అడుగు పెట్టకుండా పిల్లలతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారు. పిల్ల్లతో కలిసి ఆటలు ఆడుతున్నారు. సినిమాలు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలని క్రమం తప్పకుండా సోషల్ మీడియా ట్విట్టర్ లేదా ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
శుక్రవారం ఓ ఫొటోని షేర్ చేశారు. ఇందులో హీరో మహేష్కు ఆయన ముద్దుల కూతురు సితార హెడ్ మసాజ్ చేస్తోంది. తనయుడు గౌతమ్ సినిమా చూస్తుంటే సితార మాత్రం రెండు నిమిషాల పాటు మహేష్కు హెడ్ మసాజ్ చేసిందని నమ్రత పేర్కొంది. మహేష్బాబు, పరశురామ్ల కలయికలో రానున్న సినిమా జూలై నుంచి రెగ్యురల్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Credit: Instagram