మహేష్బాబు ఫ్లాపుల్లో వున్న దశలో `శ్రీమంతుడు` చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ని అందించారు కొరటాల శివ. ఆ తరువాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దాని తరువాత ఇద్దరి కలయికలో మరో చిత్రం `భరత్ అనే నేను` వచ్చింది. ఇది కూడా భారీ విజయం సాధించడంతో మహేష్ – కొరటాల మధ్య
అనుబంధం మరింత బలపడింది.
ఆ చనువు కారణంగానే కొరటాల టెన్షన్ చూసి మహేష్ నేను చేస్తానులే అని చెప్పాడట. ఆ మాట విని తను షాకయ్యానని కొరటాల తాజాగా చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా `ఆచార్య` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్చరణ్, నిరంజన్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో 30 నిమిషాల నిడివిగల ఓ కీలక అతిథి పాత్ర వుంది.
ఈ పాత్రలో ముందు రామ్చరణ్ నటిస్టారని ప్రచారం జరిగింది. ఆ తరువాత అదే పాత్రి మహేష్ చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయం గురించి అసలు సీక్రెట్ని కొరటాల శివ బయటపెట్టారు. మాట్లో మహేష్ని కలిసి నప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడు అనుకుంటారని అడిగితే ఏమీ అర్థం కావడం లేదని చెప్పానని, మరీ టెన్షన్గా వుంటే నేనున్నానని మహేష్ మాటిచ్చారని, ఆ మాట విని షాకయ్యానని, అదే విషయాన్ని కొంత మంది సన్నిహితులతో చెబితే అది కాస్త రకరకాలుగా ప్రచారం అయ్యిందని చెప్పుకొచ్చారు.