నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం `శ్యామ్ సింగరాయ్`. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం హీరో రాహుల్ రవీంద్రన్ని ఎంపిక చేశారు.
ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బెంగాల్లో మొదలైంది. అయితే తాజాగా అక్కడ ఎన్నికలు జరుగుతుండటంతో చిత్ర బృందం షూటింగ్ని క్యాన్సిల్ చేసుకుని లొకేషన్ని మార్చేసింది. బెంగాల్ నేపథ్యంలో సాగే పూర్వ జన్మల కథగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాని వయసు మళ్లిన వ్యక్తిగానూ కనిపించబోతున్నారు.
ఇదిలా వుంటే ఈ చిత్ర షూటింగ్ని కోల్కతా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడికి మార్చారు. బెంగాల్ ఎన్నకల కారణంగా కీలక సన్నివేశాల చిత్రీకరణని గోదావరి నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే టీమ్ మొత్తం అక్కడికి చేరింది. నాని, సాయి పల్లవి పాల్గొనగా కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.