సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద కేసు చుట్టూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వచ్చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో రియాతో పాటు పలువురని అనుమానితులుగా భావిస్తున్న సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీని గురువారం విచారించింది. ఈ విచారణలో శృతీమోడీ రియాపై సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది.
దీంతో రియా చుట్టు వుచ్చు బిగుసుకుంటోంది. మొదటి నుంచి ఈ కేసులో రియాని ముద్దాయిగా చిత్రిస్తూ వరుస కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ మేనేజర్ శృతీ మోడీ రియాపై బాంబ్ పేల్చడం బాలీవుడ్ వర్గాల్లో కలలకలం సృష్టిస్తోంది. రియా అండ్ ఆమె సోదరుడితో పాటు ఆమె అనుకూల వర్గం డ్రగ్స్ని సుశాంత్ జీవితంలో ఓ భాగంగా మార్చారని, రియా, శ్యామ్యూల్ మిరిండా డ్రగ్స్ వాడేవారని, వారే బలవంతంగా సుశాంత్కు అలవాటు చేశారంటే శృతీ మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
శృతీ మోడీ చెబుతున్న విషయాలు నిజమైతే రియా జీవితంలో కాళరాత్రి మొదలైనట్టే అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ మాటల్ని సీబీఐ పమ్మితే రియా చుట్టూ బలమైన సాక్ష్యాలు పుట్టుకు వచ్చినట్టేనని చెబుతున్నారు. 2019 వరకు తను సుశాంత్కు మేనేజర్గా పని చేశానని, తరువాతే దషా సాలియన్ తన స్థానంలోకి వచ్చిందని శృతీ మోడీ చెప్పడంతో రియా కావాలనే సుశాంత్ని డ్రగ్స్కు బానిసని చేసిందని సుశాంత్ తండ్రి చేస్తున్న వాదనకు బలం చేకూరుతోందని చెబుతున్నారు.