శ్రియ శరన్, తన భర్త ఆండ్రూతో కలిసి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోన్న విషయం తెల్సిందే. వీరిద్దరికీ కూతురు రాధా కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా వెలుగులోకి తీసుకొచ్చింది శ్రియ. ఈ కపుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు రెగ్యులర్ పోస్ట్ లతో శ్రియ, ఆండ్రులు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. రొమాంటిక్ రీల్స్, అప్డేట్స్ తో పాటు ఫన్నీ రీల్స్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటారు.
రీసెంట్ గా శ్రియ, ఆండ్రు ఇద్దరూ కలిసి రాధాతో నడుస్తూ చేసిన రీల్ ను పోస్ట్ చేసాడు శ్రియ భర్త. తన చేతిలో రాధా ఉండగా శ్రియ యంగ్ తల్లుల గురించి మాట్లాడుతోంది. మాట్లాడి నడుస్తూ ఉండగా శ్రియ అనుకోకుండా కిందపడిపోయింది. ఈ వీడియోను షేర్ చేసాడు ఆండ్రు.
“శ్రియ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. తన కెరీర్ లోనే బెస్ట్ షాట్ ఇది” అని సరదాగా క్యాప్షన్ ను కూడా జతచేసాడు. శ్రియ శరన్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ విడుదల కోసం ఎదురుచూస్తోంది. అందులో అజయ్ దేవగన్ భార్యగా నటించింది. అలాగే గమనం, నరగఁసూరన్, తడ్కా చిత్రాలను కూడా చేసింది.
ఇవి కూడా చదవండి:
క్లీవేజ్ షోతో హీటెక్కించిన శ్రియా శరన్
క్లీవేజ్ షోతో చంపేసిన శ్రియా శరన్
రహస్య వివాహం చేసుకున్న శ్రియా శరన్
View this post on Instagram