Homeటాప్ స్టోరీస్బిగుస్తున్న ఉచ్చు..కూప‌ర్ ఆసుప‌త్రికి నోటీసులు!

బిగుస్తున్న ఉచ్చు..కూప‌ర్ ఆసుప‌త్రికి నోటీసులు!

show cause notice for Cooper hospital
show cause notice for Cooper hospital

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది.  అత‌ని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వెన‌క పెద్ద కుట్ర కోణం దాగి వున్న‌ట్టు జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లని బ‌ట్టి తెలుస్తోంది. జూన్ 14న మ‌ర‌ణించిన సుశాంత్‌కు ముంబైలోని కూప‌ర్ హాస్పిట‌ల్‌లో పోస్టు మార్ట‌మ్ జ‌రిగింది. అయితే కావాల‌నే కొన్ని గంట‌లు వేయిట్ చేసిన త‌రువాతే మృత దేహానికి పోస్టు మార్ట‌మ్ నిర్వ‌హించిన‌ట్టు తాజాగా ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. విష‌యం తెల‌సుకున్న మ‌హారాష్ట్ర మాన‌వ‌హ‌క్కుల క‌మీష‌న్ కూప‌ర్ ఆసుప‌త్రికి షోకాజ్ నోటీసులు జారీ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సుశాంత్ హ‌త్య‌కు గుర‌య్యారా?  లేక ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డ్డారా? అనే విష‌యంలో కీల‌కంగా పోస్టు మార్ట‌మ్ రిపోర్ట్ నిల‌వ‌నుంది. అయితే అలాంటి కీల‌క రిపోర్ట్ స‌మయంలో రియా అక్క‌డే వుంద‌ట‌. అలా రియా అక్క‌డ ఎందుకు వుంది?  అలా ఆమెకు అనుమ‌తి ఎవ‌రిచ్చారు? అని మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ కూప‌ర్ ఆసుప‌త్రి వ‌ర్గాల‌కు నోటీసులు జారీ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -

రియా ఆసుప‌త్రిలోని మార్చురీ రూమ్‌కి వెళ్లిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. వీటిని గ‌మ‌నించిన మాన‌వ హ‌క్కుల చీఫ్ క‌మీష‌న‌ర్ సయీద్ ఈ వ్య‌వ‌హ‌రంపై సీరియ‌స్ అయ్యారు. దీనిపై ఈ నెల 31న విచారించ‌నున్నామ‌ని, రియాపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All