మెగాడాటర్ సుష్మిత కొణిదెల ఆమె భర్త విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మించిన వెబ్ సిరీస్ `షూట్ ఔట్ ఎట్ ఆలేరు`. శ్రీకాంత్, ప్రకాష్రాజ్, నందిని రాయ్, తేజ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. `ఓయ్` ఫేమ్ ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా డిజిటల్ ఓటీటీ జీ5లో ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా `షూట్ ఔట్ ఎట్ ఆలేరు` షో రీల్ ని మంగళవారం హైదరాబాద్లో మెగాపవర్స్టార్ రామ్చరణ్ రిలీజ్ చేశారు. ఎనిమిది ఎపిసోడ్స్తో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ `జీ5 ఓటీటీకి హెడ్గా మాత్రమే కాకుండా మా అక్క సుష్మిత, బావ విష్ణుకి మెంటార్గా ఉన్న ప్రసాద్ నిమ్మకాయల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన `ఓయ్` నేను చూశా. జిమ్కి వెళుతూ ఎన్నో నెలలు ఆ సినిమాలో పాటలు కారులో వింటూ వుండేవాడిని. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఆనంద్ రంగా సినిమాలు మిస్ అవుతున్నాను. మా అక్క, బావతో అసోసియేట్ అయి ఓటీటీ వేదిక కోసం ఆయన సిరీస్ చేయడం.. కమ్ బ్యాక్లో అక్కాబావకి సపోర్ట్ చేయడం హ్యాపీగా వుంది. `షూట్ ఔట్ ఎట్ ఆలేరు` షో రీల్ ఫెంటాస్టిక్గా వుంది. చాలా రియల్గా వుంది. నటన విషయంలో, రియలిస్టిక్ విషయంలో .. నటీనటుల అందరూ బెస్ట్ ఇచ్చారు. ప్లాస్టిక్ ఎలా ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయిపోయింది. తేజ, నందినిరాయ్ కాంబో అదిరింది. కారోనా మహమ్మారి కాలంలో `షూట్ ఔట్ ఎట్ ఆలేరు`టీమ్ అంతా బయటకు వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మనందరికి ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది. ఎప్పటికీ మరువలేం. ఈ ఏడాది నుండి చాలా నుర్చుకున్నాం. చిత్ర పరిశ్రమ మళ్లీ కాళ్లపై నలబడింది. జీ 5 మద్దతుతో డిసెంబర్ 25న విడుదలవుతున్న `షూట్ ఔట్ ఎట్ ఆలేరు`తో ఈ ఏడాదికి మంచి ఎండింగ్ ఇస్తామని ఆశిస్తున్నా` అన్నారు.
సుష్మిత కొణిదెల మాట్లాడుతూ `అవకాశాలు, అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం రెడీగా వుండాలని అంటారు. అలా కాకుండా మనమే ముందుకు వెళ్లి అవకాశాల కోసం చూడాలనీ.. అవి వచ్చినప్పుడు మనం తీసుకోవాలని నాన్నగారు చెబుతుంటారు. అటువంటి స్ఫూర్తి ఇవ్వడంతో పాటు కొండంత అండగా నిలబడిన నాన్నగారికి థ్యాంక్స్. `షూట్ ఔట్ ఎట్ ఆలేరు`సిరీస్ చేసే అవకాశం జీ5 నుంచి మా దగ్గరకు వచ్చింది. ప్రసాద్గారు మాకు చాలా విషయాల్లో సపోర్ట్గా నిలిచారు. ఆయనకు థ్యాంక్స్. ఆనంద్ మంచి డైరెక్టర్. అతని వలన ఈ ప్రాజెక్ట్ ఎంతో మెమరబుల్ అయింది. ప్రకాష్రాజ్గారు, శ్రీకాంత్ గారు మా మొదటి ప్రాజెక్ట్లో వుండటం ఎంతో ఎగ్జైటింగ్గా వుంది. తేజ, నందిని, రజాక్, గాయత్రీ, మోయిన్ అందరూ అద్భుతంగా నటించారు`అన్నారు. ఈ కార్యక్రమంలో జీ5 సౌత్జోన్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల, సుష్మిత కొణిదెల భర్త విష్ణు ప్రసాద్, దర్శకుడు ఆనంద్ రంగా, నందిని రాయ్, తేజ తదితరులు పాల్గొన్నారు.