మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. చిరు నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన ఆమె తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించింది. ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్కు `షూట్ అవుట్ ఎట్ అలేరు` అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ `జీ5 ఓరిజినల్` ఓటీటీ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది.
అలేరులో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని నిర్మిస్తున్నారు. ఫేక్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ మక్కా మసీద్ పేలుళ్లు .. ఆ తరువాత చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవానికి దగ్గరగా పక్కా తెలంగాణ యాసలో ఈ వెబ్ సిరీస్ వుండబోతోంది.
8 ఎపిసోడ్స్తో రిలీజ్ కానున్న ఈ వెబ్ సిరీస్ని `ఓయ్` ఫేమ్ ఆనంద్ రంగ రూపొందిస్తున్నారు. ప్రకాష్రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుష్మిత మాట్లాడుతూ ` నేను ప్రొడక్షన్ నేరు్చకునే ప్రయత్నం చేస్తున్నాను. `షూట్ అవుట్ ఎట్ అలేరు` నా తొలి అగుడు. నాన్న బర్త్డే నాడు ఈ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా వుంది. అభిమానులందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. త్వరలో ఈ సిరీస్ విడుదల తేదీని ప్రకటిస్తాం` అని పేర్కొంది.