`చూసి చూడంగానే` వంటి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శివ కందుకూరి తొలి చిత్రంతో మంచి గుర్తింపుని దక్కించుకున్నారు. ప్రస్తుతం బహు భాషా చిత్రం `గమనం`లో ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ మూవీతో పాటు `మను చరిత్ర`లోనూ నటిస్తున్నారు. చివరి షెడ్యూల్ బ్యాలెన్స్గా వుంది. ఇదిలా వుంటే తాజాగా శివ కందుకూరి హీరోగా `చేతన్ శీను` పేరుతో మరో చిత్రం మొదలైంది.
రవి ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై రవిచరణ్ మెరుపో, ప్రతిమ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `కథనం` ఫేమ్ రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో క్రిస్మస్ సందర్భంగా జరిగింది. `రాజ్ కందుకూరి కథ విని వెంటనే ఓకే చెప్పారు. కొన్ని సూచనలు చెప్పారు. ఆయన గైడెన్స్తో ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాం` అని దర్శకుడు తెలిపారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ `రాజేష్ అద్భుతమైన స్టోరీ చెప్పారు. `చేతక్ శీను` వండర్ ఫుల్ టైటిల్. రాజ్ కాంత్ కథ ఇచ్చారు. చాలా ఎగ్జైటింగ్గా వుంది. రవి, ప్రతిమగారు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి షూటింగ్కి వెళుతున్నాం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, సతీష్ ఫొటోగ్రఫీ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్గా నిలుస్తాయి` అన్నారు.
రవి ఫిల్మ్ కార్పొరేషన్లో తొలి సినిమా `చేతక్ శీను`. క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభం కావడం చాలా సంతోషంగా వుంది. రాజ్ కాంత్ సూపర్బ్ స్టోరీ ఇచ్చారు. చాలా టెమ్టింగ్గా అనిపించింది. ఈ కథకి శివ అయితే పర్ఫెక్ట్ గా వుంటాడని ఓకే చేశాం. ఇంత అద్భుతమైన కథకి రాజేష్ అయితేనే బాగుంటుందని దర్శకుడిగా ఆయనని ఎంపిక చేసుకున్నాం. ఇదొక కామిక్ థ్రిల్లర్. ఖచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం` అని నిర్మాత రవి చరణ్ మెరుపో తెలిపారు.