పవర్స్టార్ పవన్కల్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన శరత్ మరార్ ఆ తరువాత `కాటమ రాయుడు` చిత్రంతో నిర్మాతగా మారారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మంట్స్ బ్యానర్పై పవన్ నటించిన `సర్దార్ గబ్బర్సింగ్` చిత్రానికి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. విజయ్ నటించిన `మెర్సల్` చిత్రాన్ని తెలుగులో `అదిరింది` అనే పేరుతో రిలీ్ చచేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తాజాగా శరత్మరార్ డిజిటల్ రంగంలోకి ఎంటరయ్యారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మంట్స్ బ్యానర్పై వెబ్ సిరీస్ల నిర్మాణం మొదలు పెట్టారు. తొలి ప్రయత్నంగా ఆయన నిర్మించిన కామెడీ వెబ్ సిరీస్ `అసలేం జరిగిందంటే`. వైవా హర్ష, యష్న చౌదరి జంటగా నటించారు. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ని టిజిటల్ ప్లాట్ ఫామ్లో రిలీజ్ చేశారు.
ఈ వెబ్ సిరీస్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎం.ఎక్స్ ప్లేయర్లో రిలీజ్ చేశారు. లాక్డౌన్ సమయంలో చందు రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. గతం మర్చిపోయిన గయ్యాలి భార్యను భర్త (వైవా హర్ష) తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు? అన్నదే ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథాంశం.