Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్ నిర్మాత కామెడీ వెబ్ సిరీస్ ‘అస‌లేం జ‌రిగిదంటే’!

ప‌వ‌న్ నిర్మాత కామెడీ వెబ్ సిరీస్ ‘అస‌లేం జ‌రిగిదంటే’!

ప‌వ‌న్ నిర్మాత కామెడీ వెబ్ సిరీస్ ‘అస‌లేం జ‌రిగిదంటే’!
ప‌వ‌న్ నిర్మాత కామెడీ వెబ్ సిరీస్ ‘అస‌లేం జ‌రిగిదంటే’!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి అత్యంత స‌న్నిహితుడిగా మెలిగిన శ‌ర‌త్ మ‌రార్ ఆ త‌రువాత `కాట‌మ రాయుడు` చిత్రంతో నిర్మాత‌గా మారారు. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మంట్స్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ న‌టించిన `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌` చిత్రానికి కూడా వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. విజ‌య్ న‌టించిన `మెర్స‌ల్‌` చిత్రాన్ని తెలుగులో `అదిరింది` అనే పేరుతో రిలీ్ చచేసి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

తాజాగా శ‌ర‌త్‌మ‌రార్ డిజిట‌ల్ రంగంలోకి ఎంట‌ర‌య్యారు. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మంట్స్ బ్యాన‌ర్‌పై వెబ్ సిరీస్‌ల నిర్మాణం మొద‌లు పెట్టారు. తొలి ప్ర‌య‌త్నంగా ఆయ‌న నిర్మించిన కామెడీ వెబ్ సిరీస్ `అస‌లేం జ‌రిగిందంటే`. వైవా హ‌ర్ష‌, య‌ష్న చౌద‌రి జంట‌గా న‌టించారు. ఆద్యంతం వినోదాత్మ‌కంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ని టిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేశారు.

- Advertisement -

ఈ వెబ్ సిరీస్‌ని ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎం.ఎక్స్ ప్లేయ‌ర్‌లో రిలీజ్ చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో చందు రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. గ‌తం మ‌ర్చిపోయిన గ‌య్యాలి భార్య‌ను భ‌ర్త (వైవా హ‌ర్ష‌) త‌న‌కు అనుకూలంగా ఎలా మ‌లుచుకున్నాడు? అన్న‌దే ఈ వెబ్ సిరీస్ ప్ర‌ధాన క‌థాంశం.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All