దేశ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో శంకర్ ప్రధమ స్థానంలో నిలుస్తారు. ఆయనతో సినిమా చేయాలని చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి దర్శకుడిగాతో బాలీవుడ్ హీరో రణ్వీర్సింగ్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారని, ఇది బ్లాక్ బస్టర్ హిట్ `అపరిచితుడు` (అన్నియన్) చిత్రానికి రీమేక్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ వార్తలని నిజం చేస్తూ శంకర్ తన బాలీవుడ్ ప్రాజెక్ట్ని ప్రకటించారు. రామ్చరణ్తో దిల్ రాజు నిర్మించబోయే 50వ ప్రాజెక్ట్ని ఇటీవలే ప్రకటించిన శంకర్ ఈ భారీ చిత్రాన్ని జూన్ లేదా జూలైలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే తాజాగా రణ్వీర్సింగ్తో బాలీవుడ్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్టు బుధవారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని `అపరిచితుడు` (అన్నియన్)కి రీమేక్గా చేయబోతున్నారు.
ఈ భారీ చిత్రాన్ని ఎన్ మూవీస్ అయద పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడ నిర్మించబోతున్నారు. `ఈ క్షణంలో నాకన్నా ఎవ్వరూ సంతోషంగాషించే వ్యక్తి మరొకరు ఉండరు. లార్జర్దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని తిరిగి అందించబోతున్నాం. రణవీర్ తో `అన్నీయన్` ని అధికారికంగా రీమేక్ చేయబోతున్నామని అధికారికంగా వెల్లడిస్తున్నాం` అని దర్శకుడు శంకర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ డ్రెస్ కోడ్ లో డైరెక్టర్ చైర్లో కూర్చుని శంకర్ వుండగా రణ్వీర్, నిర్మాత జయంతిలాల్ గడ పక్కన నిలబడి వున్న ఫొటోని షేర్ చేశారు.