సాహో నుండి రెండో పాట
ప్రభాస్ హీరోగా నటించిన సాహో నుండి రెండో పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . ప్రభాస్ – శ్రద్దా కపూర్ జంటగా నటించిన సాహో చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . యువి క్రియేషన్స్ బ్యానర్ పై 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30 న విడుదల చేయనున్నారు . దాంతో రేపు ఉదయం రెండో పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
ఇప్పటికే సయ్యా సైకో అనే పాటని విడుదల చేయగా దానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది దాంతో ” ఏ చోట నువ్వున్నా ” అనే యుగళగీతాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసారు . దానికి సంబందించిన పోస్టర్ ని కూడా విడుదల చేసారు సోషల్ మీడియాలో . ఈ పాట అందరినీ అలరించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . భారీ ఎత్తున విడుదల కానున్న సాహో చిత్రం బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడం విశేషం .