సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా మూడు నెలల పాటు జరగని షూటింగ్ ఈ వారమే తిరిగి మొదలైంది. అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ సర్కారు వారి పాట షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఇంకా చాల సమయం ఉంది కానీ తాజాగా ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.
సర్కారు వారి పాట చిత్ర ఫస్ట్ లుక్ ను ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారు. పరశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
సర్కారు వారి పాటను సంక్రాంతి 2022లో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.