సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఎంటర్టైన్మెంట్ కు మారుపేరుగా నిలిచిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ గా కనిపించనున్న సంగతి తెల్సిందే.
దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా కొండారెడ్డి బురుజు సెంటర్ సీన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోనే స్పెషల్ సెట్ వేశారు.
ఇదంతా పక్కనపెడితే ఈ సినిమాలో వినోదం అదిరిపోతుందట. అందులోనూ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వినోదం పుష్కలంగా ఉంటుందట. ఇదే ఈ చిత్రంలో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని అంటున్నారు. వినోదం కనుక వర్కౌట్ అయితే సరిలేరు నీకెవ్వరు మరో లెవెల్ కి వెళ్లడం ఖాయమట.