సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హల్చల్ సృష్టించిన సంగతి తెల్సిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది. ఈ చిత్రానికి మొదట యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. అయితే మహేష్ ఛరిస్మా, సంక్రాంతి సీజన్ కలగలిసి సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా 100 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అయితే సెకండ్ వీక్ ముగిసాక ఈ సినిమా కొంచెం స్లో అయినట్లు కనిపించింది కానీ వీకెండ్ వచ్చేసరికి మళ్ళీ పుంజుకుంది. ఈ సినిమా నిన్న ఏకంగా 2.5 కోట్లకు పైనే రెండు రాష్ట్రాల్లో షేర్ ను నమోదు చేయడం విశేషం.
మొత్తం 16 రోజులకు కలిపి చూసుకుంటే 109 కోట్లకు పైన వసూళ్లతో బాహుబలి 1 కలెక్షన్స్ ను దాటేలా కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ఫీట్ సాధించడం ఖాయం. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు తెలుగు చిత్రాల ఆల్ టైమ్ టాప్ 4 స్థానంలో నిలవడం విశేషం.
సరిలేరు నీకెవ్వరు 16 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
నైజాం : 36.29 కోట్లు
సీడెడ్ : 15.07 కోట్లు
గుంటూరు : 9.52 కోట్లు
ఉత్తరాంధ్ర : 18.57 కోట్లు
తూర్పు గోదావరి : 10.88 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.15 కోట్లు
కృష్ణ : 8.51 కోట్లు
నెల్లూరు : 3.95 కోట్లు
16 రోజుల మొత్తం షేర్ : 109.94 కోట్లు
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.