`అర్జున్రెడ్డి` చిత్రంతో టాలీవుడ్లో సంచలనం సృష్టించారు యువ దర్శకుడు సందీప్ వంగ. ఇదే చిత్రాన్ని హిందీలో `కబీర్సింగ్` పేరుతో తెరకెక్కించి అక్కడ కూడా రికార్డు సృష్టించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం షాహీద్ కపూర్ కెరీర్లోనే సరికొత్త చరిత్రని సృష్టించింది. అయితే ఈ సినిమా తరువాత రణ్బీర్కపూర్, లేదా రణ్వీర్సింగ్తో గ్యాంగ్స్టర్ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అతని ప్లాన్ మాత్రం వర్కవుట్ కాలేదు.
రణ్బీర్కపూర్, రణ్వీర్సింగ్ వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా వున్నారు. రణవీర్సింగ్ `జయేష్ భాయ్ జోర్దార్` చిత్రంలో బిజీగా వున్నాడు. రణ్బీర్కపూర్ `బ్రహ్మాస్త్ర` పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ఈ బిజీలో సందీప్ వంగతో సినిమా చేయడానికి ఈ ఇద్దరూ ఆసక్తిని చూపించలేదు. దీంతో సందీప్ టీ సిరస్ వారు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రభాస్తో సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు. మధ్యలో నాగ్ అశ్విన్ వచ్చి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో సందీప్ వంగ సినిమా మళ్లీ మొదటికి వచ్చింది అనుకున్నారంతా,
కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ప్రభాస్ సినిమా కోసం `డెవిల్` అనే టైటిల్ని ఇప్పటికే కన్ఫమ్ చేపిన సందీప్ వంగ ఈ సినిమా స్క్రిప్ట్కు తుదిమెరుగులు దిద్దేపనిలో వున్నాడ. నాగ్ అశ్విన్ సినిమా ఈ ఏడాది చివరలో ప్రారంభం కానునంది కాబట్టి ఈ మధ్యలో వున్న టైమ్లో తన సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నడని తెలిసింది.