తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం `అర్జున్రెడ్డి`. టాలీవుడ్ గమనాన్ని మార్చి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. న్యూఏజ్ సినిమాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. హీరో విజయ్ దేవరకొండని స్టార్ని చేసిన ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది. తమిళంలో `ఆదిత్య వర్మ`గా, హిందీలో `కబీర్సింగ్` పేరుతో రీమేక్ చేయబడింది. `కబీర్సింగ్`లో షాహీద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమా సక్సెస్తో అతని కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 10 నుంచి 13 కోట్లు డిమాండ్ చేసే ఈ హీరో ఇప్పడు ఏకంగా 30 నుంచి 40 డిమాండ్ చేస్తున్నాడు.
ఇదే చిత్రంలోని కీర్తి పాత్రలో కియారా అద్వానీ నటించింది. ఈ సినిమా ఆమెకి కథానాయిగా మంచి క్రేజ్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో కియారా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. `గూడ్ న్యూజ్` చిత్రం కోసం ఈ చిత్రంలోని ఓ పాటని రిలీజ్ చేయడం కోసం కియారా చండీగఢ్ వెళ్లింది. అక్కడ ఆమె `కబీర్సింగ్`పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. `లస్ట్ స్టోరీస్` తో ప్రేక్షకులు తనని నటిగా గుర్తించారని, దాని తరువాతే తనతో మేకర్స్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించడం మొదలుపెట్టారని, `కబీర్సింగ్`తో నటిగా ఎంతో మందికి దగ్గరయ్యానని చెప్పుకొచ్చింది.
ఈ సినిమాపై వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ `ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయం అంటూ వుంటుందని, దాన్నే అంతా బయటపెడుతున్నారని, సినిమా చూసి అంతా తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడం ఆనందాన్ని కలిగించిందని, అయితే ఈ సినిమా విషయంలో తనకూ రెండు అభిప్రాయాలున్నాయని వెల్లడించింది. నటిగా ప్రీతి పాత్ర నాకు ఓ ఛాలెంజ్గా నిలిచిందని, అయితే ఇలాంటి పాత్రల్నిఇకపై తాను చేయాలనుకోవడం లేదని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.