పెళ్లి తరువాత సినిమాల విషయంలో సమంత పంథా మారింది. నటనకు ప్రాధాన్యం వున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తోంది. మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లని సొంతం చేసుకంటోంది. అయితు సామ్ సక్సెస్ పరంపరకు `జాన్` బ్రేక్ వేసింది. తమిళ హిట్ చిత్రం `96` ఆధారంగా రూపొందిన `జాను` చిత్రం ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఈ సినిమాని అనుమానంగానే అంగీకరించిన సమంతకు నిరాశనే మిగల్చింది.
దీంతో ఆలోచనలో పడిన సామ్ తేరుకుని మళ్లీ మహిళా ప్రధాన చిత్రాన్నే అంగీకరించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. `గేమ్ ఓవర్` ఫేమ్ అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్నిరూపొందించనున్నారు. సోనీ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
సరికొత్త కథగా తెరపైకి రానున్న ఈ చిత్రంలో ప్రశాంత్ హీరోగా నటించన్నారుట. అతనిది కీలక పాత్రే కానీ సమంతని పాత్రిని డామినేట్ చేసే పాత్ర మాత్రం కాదని తెలిసింది. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ని కలిసి కథ వినిపించారట. అయితే ప్రశాంత్ మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదని తెలిసింది. సోనీ సంస్థ మాత్రం ప్రశాంత్ కోసం ప్రయత్నాలు చేస్తోందట. ఆల్ మోస్ట్ ఫైనల్ చేసినట్టేనని కోలీవుడ్ సమాచారం. వచ్చే నెల నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.