పెళ్లికి ముందు.. స్టార్గా ఎదుగుతున్న క్రమంలో సమంత హీరో సిద్ధార్ధతో ప్రేమలో వున్న విషయం తెలిసిందే. కొంత కాలం ఇద్దరూ చెప్పపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. శ్రీకాళహస్తికి వెళ్లి కాల సర్పదోషానికి సంబంధించిన పూజలన్నీ చేశారు. కట్ చేస్తే ఇద్దరూ విడిపోయారు. అంటే సమంత అతనితో విడిపోయింది. ప్రేమ గీమా జాన్తానై అంటూ సిద్ధార్ధ్కు బ్రేకప్ చెప్పేసింది. ఇది అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టించింది.
అయితే ఆ తరువాత నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ ప్రేమని పెళ్లిదాకా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇద్దరు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పెళ్లికి ముందు కానీ, పెళ్లి తరువాత కానీ సామ్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ గురించి ఎక్కడా ప్రస్థావించలేదు. ఎవరూ అడిగే సాహసం చేయలేదు. తాజాగా తన జీవితంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. అతడితోనే వుండి వుంటే తనకు సావిత్రికి పట్టిన గతే పట్టేదని, ఈ విషయంలో తాను అదృష్ట వంతురాలినని వెల్లడించింది.
ప్రేమలో వున్నా చివరి నిమిషంలో రియలైజ్ అయ్యానని, మనసు మార్చుకుని ఓ బ్యాడ్ రిలేషన్ షిప్ నుంచి బయటపడ్డానని, ఆ సమయంలో నాకు దేవుడిచ్చిన వ్యక్తి నాగచైతన్య అని, అతను జెమ్ అని, తన సర్వస్వం అని చెప్పుకొచ్చింది.