`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో సూపర్హిట్ని సొంతం చేసుకున్న రామ్ తన తదుపరి చిత్రాన్ని కూడా వెరైటీగానే ప్లాన్ చేశాడు. కొత్త తరహా క్యారెక్టరైజేషన్తో రామ్ నటిస్తున్నతాజా చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకుడు. స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం `థడమ్` ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. రామ్ నటిస్తున్న తొలి థ్రిల్లర్ చిత్రమిది.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ని చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేసింది. హీరో రామ్ తొలిసారి ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకేలా వుండే ఆదిత్య, సిద్ధార్థ అనే ఇద్ధరు యువకుల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా వుండబోతోంది. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో చుట్టూ సాగే కథ ఇది. `క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేస్ చూడటం ఇదే ఫస్ట్ టైమ్..` అనే వాయిస్తో టీజర్ మొదలైంది.
టీజర్లో చూపించిన సన్నివేశాలని బట్టి సిద్ధార్థ ఆదిత్యని క్రైమ్లో ఇరికించాలని చూస్తున్నాడా? ఇంతకీ ఆదిత్యకి సిద్ధార్ధకీ వున్న సంబంధం ఏంటి? ఈ రెండు పాత్రలకీ పోలీస్ ఆఫీసర్ నివేదా పేతురాజ్కున్న లింకేటి? అఏది తెలియాలంటే ఈ రేసీ థ్రిల్లర్ చూడాల్సిందే. రామ్ పాత్రని మలిచిన తీరు, సమీర్రెడ్డి ఫొటోగ్రఫీ. మణిశర్మ ఆర్ ఆర్ సినిమాని ఓ ఇంటెన్స్ రేసీ థ్రిల్లర్గా చూపిస్తున్నాయి. టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొత్త తరహాలో రామ్ పాత్రని డిజైన్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది.