అత్యాచారం, ఆపై దారుణంగా పెట్రోల్ పోసి హత్య చేసి అమాయకురాలైన దిశ ను నలుగురు రాక్షసులు అత్యంత పాశవికంగా హతమార్చిన సంఘటన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నలుగురు నరహంతకుల్ని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. అయితే ఈ ఎన్కౌంటర్పై మానవహక్కుల సంఘాలు సుప్రీమ్ను ఆశ్రయించడంతో దిశ హంతకుల ఎన్ కౌంటర్పై విచారణ జరుగుతోంది. ఇదిలా వుంటే మానవ మృగాల బారిన పడి అత్యంత దారుణంగా హత్యకు గురైన దిశ పాత్రలో స్టార్ హీరోయిన్ కనిపించబోతోందని తెలిసింది.
దిశ ఘటన ఆధారంగా త్వరలోనే ఓ సినిమా తెరపైకి రాబోతోంది. ఇందులో సమంత దిశ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో దారుణ యాక్సిడెంట్ని కథావస్తువుగా తీసుకుని దాన్ని కళ్లకు కట్టినట్టు తెరపై ఆవిష్కరించిన చిత్రం `జర్నీ`. ఈ సినిమాని తెరకెక్కించిన శరవణన్ తాజాగా దిశ సంఘటన ఆధారంగా ఓ కథని సిద్ధం చేసుకున్నాడట. సంచలనం సృష్టించనున్న ఈ సినిమా కోసం దిశ పాత్రలో సమంతని సంప్రదించారట. కథ నచ్చడంతో సమంత వెంటనే అంగీకరించినట్టు చెబుతున్నారు.
దిశగా సమంత నటించడానికి అంగీకరించడంతో ఈ వార్త సోషల్ మీడియలో వైరల్గా మారింది. దిశ కథ తెరపైకొస్తే దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే బయటికి రానుంది, సమంత ప్రస్తుతం `96` రీమేక్తో పాటు వెబ్ సిరీస్ `ఫ్యామిలీమ్యాన్ 2` లో నటిస్తోంది. ఇవి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.