సల్మాన్ ఖాన్ నటించిన భారత్ సినిమా 200 కోట్ల మైలురాయి ని దాటేసింది . జూన్ 5 న విడుదలైన భారత్ చిత్రానికి ఉత్తరాది ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు దాంతో 200 కోట్ల పైచిలుకు వసూళ్లు లభించాయి . సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటించిన ఈ చిత్రంలో టబు , దిశా పటాని , జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు .
సల్మాన్ ఖాన్ కు గత రెండు చిత్రాలు బాగా దెబ్బేసాయి దాంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి . అయితే భారత్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లనే సాధిస్తోంది . ఈరోజు కబీర్ సింగ్ విడుదల అవ్వడం దానికి హిట్ టాక్ రావడంతో సల్మాన్ ఖాన్ భారత్ చిత్రంపై ఆ ప్రభావం పడనుంది . అయితే ఇప్పటికే 201 కోట్లకు పైగా వసూల్ చేసింది కాబట్టి అదే పెద్ద ఫిగర్ అని అనుకుంటున్నారు .
- Advertisement -