![మెగా హీరోతో సాయి పల్లవి నిజమేనా? మెగా హీరోతో సాయి పల్లవి నిజమేనా?](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/09/Sai-pallavi-to-paly-ram-charan-love-intarest-in-Acharya.jpg)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. `సైరా నరసింహారెడ్డి` చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడం, పైగా కీలక అతిథి పాత్రలో మెగా పవర్స్టార్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ధర్మస్థలి నేపథ్యంలో ఓ కామ్రేడ్ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం, ఈ చిత్ర కథపై వివాదం తలెత్తడం వంటి కారణాలతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్కు కేడా చోటుందట. రామ్చరణ్ పాత్రకు జోడీగా ఓ హీరోయిన్ వుంటుందని తెలిసింది. ఆ పాత్ర కోసం సమంత, కియారా అద్వానీల పేర్లు వినిపించాయి. తాజాగా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. కామ్రేడ్ తరహా పాత్రలో రామ్చరణ్ కనిపించనున్నారు. మరి చరణ్ పక్కన సాయి పల్లవి అతిథి పాత్రలో నటించడానికి అంగీకరిస్తుందా? లేఆ అన్నదే ఆసక్తికరంగా మారింది.
సాయి పల్లవి ప్రస్తుతం రానాతో `విరాటపర్వం`, నాగచైతన్యతో `లవ్స్టోరీ` చిత్రాల్లో నటిస్తోంది. బ్యాలెన్స్గా వున్న షూటింగ్ని `లవ్స్టోరీ` టీమ్ ఇటీవలే ప్రారంభించారు. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ని పూర్తి చేస్తున్నారట.