Homeటాప్ స్టోరీస్మెగా హీరోతో సాయి ప‌ల్ల‌వి నిజ‌మేనా?

మెగా హీరోతో సాయి ప‌ల్ల‌వి నిజ‌మేనా?

మెగా హీరోతో సాయి ప‌ల్ల‌వి నిజ‌మేనా?
మెగా హీరోతో సాయి ప‌ల్ల‌వి నిజ‌మేనా?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం కావ‌డం, పైగా కీల‌క అతిథి పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ న‌టిస్తుండ‌టంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ధ‌ర్మ‌స్థ‌లి నేప‌థ్యంలో ఓ కామ్రేడ్ క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌టం, ఈ చిత్ర క‌థ‌పై వివాదం త‌లెత్తడం వంటి కార‌ణాల‌తో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది.

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌కు కేడా చోటుంద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌కు జోడీగా ఓ హీరోయిన్ వుంటుంద‌ని తెలిసింది. ఆ పాత్ర కోసం స‌మంత‌, కియారా అద్వానీల పేర్లు వినిపించాయి. తాజాగా సాయి ప‌ల్ల‌వి పేరు వినిపిస్తోంది. కామ్రేడ్ త‌ర‌హా పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నారు. మ‌రి చ‌ర‌ణ్ ప‌క్క‌న సాయి ప‌ల్ల‌వి అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రిస్తుందా?  లేఆ అన్న‌దే ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం రానాతో `విరాట‌ప‌ర్వం`,  నాగచైత‌న్య‌తో `ల‌వ్‌స్టోరీ` చిత్రాల్లో న‌టిస్తోంది. బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని `ల‌వ్‌స్టోరీ` టీమ్ ఇటీవ‌లే ప్రారంభించారు. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్‌ని పూర్తి చేస్తున్నారట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All