మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య` చుట్టూ నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ చిత్ర కథ మెయిన్ లైన్ తనదే అంటూ ఇటీవల ఓ యువ దర్శకుడు చిత్ర బృందంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ రచ్చ ఆగకముందే మరో అసోసియేట్ డైరెక్టర్ `ఆచార్య` మూవీపై సంచలన విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఆచార్య` చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ మోషన్ పోస్టర్ని చిత్ర బృందం చిరు పుట్టిన రోజు కానుకగా విడుదల చేసింది. మోషన్ పోస్టర్లో హీరో చిరంజీవి కామ్రేడ్గా కనిపిస్తున్నారు. ధర్మస్థలి కోసం ఆయన పోరాటం చేసే వ్యక్తిగా కనిపిస్తున్నారు. దేవాదాయ భూములని ఆక్రమించిన బడా బాబులకు వ్యతిరేకంగా పోరాడే కామ్రేడ్ పాత్రలో చిరు కనిపించబోతున్నారని అర్మవుతోంది. అయితే ఇదే థీమ్ నేపథ్యంలో తనూ ఓ కథని సిద్ధం చేసి కొన్నేళ్ల క్రిమే రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేయించానని దర్శకుడు కన్నెగంటి అనిల్ కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మరో వ్యక్తి `ఆచార్య`పై ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
డైరెక్షన్ టీమ్లో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రాజేష్ అనే వ్యక్తి తాజాగా `ఆచార్య` మెయిన్ ప్లాట్ తనదే అంటూ సవాల్ చేశారు. ఒక ఆలయ వ్యవసాయ భూములు ఆక్రమణకు గురవుతాయని, దానిపై ఆ వూరి పెద్ద ఫైట్ చేస్తాడని, అతన్ని ఆ దుండులు హత్య చేస్తే ఆ పగని ఆయన కొడుకు ఎలా తీర్చుకున్నాడన్నదే ప్రధాన ఇతివృత్తమని, అదే థీమ్తో `ఆచార్య` చిత్రం తెరకెక్కుతోందని, ఆ లైన్ తన నుంచి కాపీ చేశారని అసోసియేట్ డైరెక్టర్ రాజేష్ ఆరోపిస్తున్నారు. తాజా వివాదంపై `ఆచార్య` టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.