Homeటాప్ స్టోరీస్`ఆర్ఆర్ఆర్‌` ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ఫీస్టేనా?

`ఆర్ఆర్ఆర్‌` ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ఫీస్టేనా?

`ఆర్ఆర్ఆర్‌` ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ఫీస్టేనా?
`ఆర్ఆర్ఆర్‌` ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ఫీస్టేనా?

టాలీవుడ్ చ‌రిత్ర‌లో చాలా ఏళ్ల త‌రువాత ఇద్ద‌రు క్రేజీ స్టార్‌లు క‌లిసి న‌టిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. చారిత్ర‌క అంశాల నేప‌థ్యంలో ఫిక్షన్‌గా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. బ్రిటీష్ వారిపై నిజాం నిరంకుశ పాల‌పై జ‌రిగిన స్వాతంత్య్ర పోరాటంలో‌ చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ఇద్ద‌రు యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం.

ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ ద‌శ‌లో పోరాటం చేశారన్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు అదే నిజ‌మైతే అన్న ఫిక్ష‌న‌ల్ క‌థ‌తో జ‌క్క‌న్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో భార‌తీయ తెర‌పై మునుపెన్న‌డూ రాని విధంగా స‌రికొత్త పంథాలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు చ‌జ‌రిగిన షూటింగ్‌తో 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

- Advertisement -

బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని ఇటీవ‌ల గండిపేట్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా దెబ్బ‌తో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. అయితే గ‌త కొంత కాలంగా అటు మెగా ఫ్యాన్స్‌ని, ఇటు యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ని ఓ ప్ర‌శ్న క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్స్ క‌లిసి న‌టిస్తున్నారు. అయితే ప్ర‌తీ సినిమా త‌ర‌హాలో ఒక్క‌రికి మాత్ర‌మే ప్రాధాన్య‌త వుంటుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే ఇది. అయితే ఇది నిజం కాద‌ని ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త వుంటుంద‌ని, ఫ్యాన్స్‌కు ఈ మూవీ విజువ‌ల్ ఫీస్ట్‌గా వుంటుంద‌ని ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All