Homeటాప్ స్టోరీస్ఫొటో వెన‌క స్టోరీ చెప్పిన సాయిధ‌రమ్‌తేజ్‌!

ఫొటో వెన‌క స్టోరీ చెప్పిన సాయిధ‌రమ్‌తేజ్‌!

ఫొటో వెన‌క స్టోరీ చెప్పిన సాయిధ‌రమ్‌తేజ్‌!
ఫొటో వెన‌క స్టోరీ చెప్పిన సాయిధ‌రమ్‌తేజ్‌!

మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక వివాహం రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఉద‌య్ విలాస్‌లో అత్యంత వైభ‌వంగా గుంటూరుకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్‌రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో  జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో మెగా ఫ్యామిలీల‌తో పాటు అల్లు వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ పాల్గొని హంగామా చేశారు.

సంగీత్‌లో న‌వ దంప‌తులు చైత‌న్య‌, నిహారిక చిందులేసి ర‌చ్చ చేశారు. రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్నీ, వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా ఆడిపాడారు. ఆట పాట‌ల‌తో త‌మ‌దైన స్టైల్లో సంద‌డి చేశారు. ఆ త‌రువాత మెహందీ వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మ‌లో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఇదే క్ర‌మంలో ప‌వ‌న్‌తో క‌లిసి సాయిధ‌ర‌మ్‌తేజ్ ఫొటోల‌కు పోజులిచ్చిన స్టిల్ ఇంట‌ర్నెట్‌లో ట్రెండింగ్ అయింది.

- Advertisement -

ఈ ఫొటో వెన‌కున్న స్టోరీని తాజాగా సాయిధ‌ర‌మ్‌తేజ్ బ‌య‌ట‌పెట్టారు. ఉద‌య్ విలాస్‌లో పవన్ కళ్యాణ్ న‌డుస్తుండ‌గా `మామ‌ ఒక ఫొటో` అని అడిగాన‌ని అయితే  అప్పుడు `ఏరా ముందు నాతో ఫోటో ఎప్పుడు దిగ‌లేదా?` అని  మామ‌ అన్నార‌ని, అప్పుడు కొంత భ‌య‌మేసింద‌ని చెప్పుకొచ్చాడు. అయితే అది ఆయ‌న అంటే భ‌యం కాద‌ని, అభిమానం, గౌర‌వం అని వెల్ల‌డించాడు సాయిధ‌ర‌మ్‌తే. ఆ సంద‌ర్భంలో దిగిన ఫొటో అది అని చెప్పుకొచ్చాడు. సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` ఈ నెల 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All