`ప్రతిరోజు పండగే` మూవీ సక్సెస్తో సాయిధరమ్తేజ్ మళ్లీ ట్రాక్లోకి వచ్చారు. ఈ మూవీ తరువాత స్పీడు పెంచిన మెగా మేనల్లుడు ప్రస్తుతం రెండు చిత్రాల్ని లైన్లో పెట్టారు. తను నటించిన `సోలో బ్రతుకే సోబెటర్` ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇదిలా వుంటే సాయి ధరమ్తేజ్ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఓ మూవీ చేస్తున్నారు. దీనికి దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. లాక్డౌన్కి ముందు పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
ఇందులో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాయి ధరమ్తేజ్ పూర్తి పరిణతి చెందిన యువకుడిగా కనిపిస్తారట. ఇందులో ఆయన ఐఏఎస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఇటీవలే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు 60 శాతం పూర్తయిందని తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి `రిపబ్లిక్` అనే టైటిల్ని అనుకుంటున్నారట.
త్వరలోనే ఈ టైటిల్ని ప్రకటించే అవకాశం వుందని తెలిసింది. రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు సాయి ధరమ్తేజ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.