మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గత ఏడాది విడుదలైన చిత్ర లహరి, ప్రతిరోజు పండగే చిత్రాలు అనూహ్య విజయాల్ని సాధించా.ఇ ఈ రెండు చిత్రాలతో హీరో సాయిధరమ్తేజ్ మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేశారు. సక్సెస్ జోష్లో వున్న సాయి ధరమ్తేజ్ ప్రస్తుతం `సోలో బ్రతుకే సోబెటరు` చిత్రంతో పాటు దేవ కట్టా రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.
`ప్రస్థానం` వంటి విభిన్నమైన చిత్రాన్ని అందించిన దేవా కట్టా కొత్త కథతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు తెలిసింది. జె.భగవాన్. జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవలే జరిగింది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటికి ప్రారంభం కాలేదు. దీంతో ఈ చిత్రంపై, చిత్ర నటీనటులపై తాజాగా రూమర్స్ మొదలయ్యాయట.
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా చిత్ర నిర్మాతలు భగవాన్, పుల్లారావు శనివారం మీడియాకు క్లారిటీ ఇచ్చారు. రెగ్యులర్ షూటింగ్ని ఈ నెల 20 నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేశామని అయితే కోవిడ్ 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, లాక్డౌన్ విధించడంతో ఈ పరిస్థితుల్లో షూటింగ్ కష్టం కాబట్టి రెగ్యులర్ షూటింగ్ని వాయిదా వేశాం. వైరస్ ప్రభావం తగ్గిన తరువాత రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది తెలియజేస్తాం. అలాగే ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటులపై పుకార్లు వినిపిస్తున్నాయి. అందులో ఎలంటి వాస్తవం లేదు. ఆ పుకార్లని నమ్మవద్దు`అని నిర్మాతలు వెల్లడించారు.