`ప్రస్థానం` చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు దేవా కట్టా. ఈ సినిమా తరువాత ఆయన చేసిన ఏ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. నెట్ఫ్లిక్స్ కోసం `బాహుబలి` బిఫోర్ ద బిగినింగ్ ` పేరుతో నెట్ఫ్లిక్స్ కోసం మూడేళ్లు పనిచేసి వెబ్ సిరీస్లు చేసిన దేవా కట్టా మళ్లీ సినిమాల వైపు వస్తున్నారు.
సాయిధరమ్తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన ఈ సినిమాని పూర్తి చేస్తూనే మహేష్ బాబు నిర్మాణ సంస్థ మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ కోసం మళ్లీ వెబ్సిరీస్ బాట పడుతున్నారు. సాయిధరమ్తేజ్ చిత్రాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్న దేవా కట్టా వెబ్ సిరీస్ని మాత్రం ఈ ఏడాది చివరలో మొదలుపెట్టనున్నాడట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేసిన దేవా కట్టా ఈ వెబ్ సిరీస్ని పొలిటికల్ థ్రిల్లర్ కథతో చేయబోతున్నాడట. కొన్ని ఎపిసోడ్లని తాను పూర్తి చేసి మిగతా ఎపిసోడ్లని తన శిష్యులతో డైరెక్ట్ చేయించనున్నాడని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ కోసం ప్రత్యేకంగా చేస్తున్నట్టు తెలిసింది.