Homeటాప్ స్టోరీస్శరవేగంగా తేజ్ తర్వాతి చిత్ర పనులు

శరవేగంగా తేజ్ తర్వాతి చిత్ర పనులు

శరవేగంగా తేజ్ తర్వాతి చిత్ర పనులు
శరవేగంగా తేజ్ తర్వాతి చిత్ర పనులు

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రిపబ్లిక్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం జూన్ 4న విడుదల కాబోతోందని అధికారికంగా వెల్లడైంది కూడా. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు షూటింగ్ ముగిసే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ తర్వాతి చిత్రానికి సంబంధించిన పనులు సాగుతున్నాయి. ఇప్పటికే తేజ్ నెక్స్ట్ మూవీని కార్తీక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తాడు అని అనౌన్స్ అయింది. అలాగే ఈ చిత్రాన్ని సుకుమార్ సమర్పించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.

- Advertisement -

ఈ సినిమాలో పలు పాత్రల కోసం కాస్టింగ్ కాల్ ను కూడా అనౌన్స్ చేసారు. మార్చ్ లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ కు వెళ్లనుంది. తేజ్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు సాధించి మంచి ఊపు మీదున్నాడు. ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంగా నెక్స్ట్ సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All