‘చిత్రలహరి‘ హిట్ తో సాయి ధరమ్ తేజ్ కేరియర్ కొంత గాడిలో పడిందనే చెప్పాలి.. ఇప్పుడు యమస్పీడ్ గా గేర్ మార్చి వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మారుతీ దర్శకత్వంలో ‘ప్రతి రోజు పండగ’ చిత్రంలో నటిస్తున్నారు.. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్లో రిలీజ్ కానుంది.. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ దేవా కట్ట దర్శకత్వంలో నటించనున్నారు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య’ వంటి డిఫరెంట్ చిత్రాలను రూపొందించిన దేవా మరో విభిన్నమైన కథాంశంతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అక్టోబర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.. ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.. దీని తరువాత సాయి ధరమ్ తేజ్ బి. వి. యస్. ఎన్ ప్రసాద్ బ్యానర్ లో సినిమా చేయనున్నాడు.. ఈ చిత్రానికి సుబ్రమన్యం దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది..!!
సాయి ధరమ్ తేజ్, దేవ కట్ట, జె.భగవాన్, జె.పుల్లారావు..
మరో కొత్త సినిమాకి సైన్ చేసిన సాయి ధరమ్ తేజ్!
- Advertisement -
Advertisement