మెగా మేనల్లుడు సాయి ధరమ్తేజ్ వరుస ఫ్లాపుల తరువాత మళ్లీ ట్రాక్లోకి వచ్చారు. కిషోర్ తిరుమల తెరకెక్కించిన `చిత్రలహరి` చిత్రం ఊరటకలిగించే విజయాన్ని అందిస్తే మారుతి తెరకెక్కించిన `ప్రతిరోజు పండగే` సూపర్హిట్ని అందించి సాయితేజ్ కెరీర్ని పిచ్చి స్పీడందుకునేలా చేసింది. ఈ సినిమా ఇచ్చిన విజయానందంలో వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇందులో యువ నిర్మాత బాపినీడు నిర్మిస్తున్న `సోలో బ్రతుకే సోబెటర్` ఒకటి కాగా.. మరొకటి దేవా కట్టా తెరకెక్కిస్తున్న చిత్రం. జెబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కరోనా వైరస్ ప్రబలడానికి ముందు పవర్స్టార్ పవన్కల్యాణ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇంత వరకు ప్రారంభం కాలేదు.
ఇదిలా వుంటే ఇందులో సాయి తేజ్ పవర్పుల్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తారని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం హీరో ఇప్పటికే ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టాడని చెబుతున్నారు. పలువురు పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన వీడియోలు. వార్తలు చూస్తున్నారట. ఇందులోని ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది.