టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఓ పక్క కరోనా ఉదృతి కనసాగుతున్నా టాలీవుడ్లో మాత్రం పెళ్ళిళ్లు ఆగడం లేదు. దిల్ రాజు నుంచి `సాహో` డైరెక్టర్ సుజిత్ వరకు ఇప్పటి వరకు ఐదారు జంటలు పెళ్లి పీటలెక్కేశాయి. త్వరలో అంటే ఈ నెల 8న దగ్గు బాటి రానా కూడా వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ నెక్ట్స్ మెగా మేనల్లుడు సాయి ధరమ్తేజ్ వంతే అంటూ చర్చించుకుంటున్నారు.
ఇదిలా వుంటే తన కాలేజీ డేస్ లవ్ స్టోరీని రివీల్ చేసి సాయిధరమ్ తేజ్ షాకిచ్చారు. `చిత్రలహరి` సినిమాతో మళ్లీ విజయాల బాట పట్టిన సాయి ధరమ్ తేజ్ `ప్రతీరోజు పండగే` సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుని మాంచి జోరుమీదున్నారు. 33 ఏళ్ల ఈ మెగా హీరో పెళ్లిపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. తను ప్రేమించిన యువతిని పరిచయం చేస్తారా ? లేక నితిన్, నిఖిల్ తరహాలోనే ఎంగేజ్మెంట్ అంటూ షాకిస్తారా? అని అంతా చర్చించుకుంటున్నారు.
ఇదిలా వుంటే సాయిధరమ్తేజ్ మాత్రం తన కాలేజీ రోజుల్లో ప్రేమని గుర్తు చేసి ఆశ్చర్యపరిచారు. తన జీవితంలోనూ ప్రేమదేశం లాంటి లవ్ స్టోరీ వుందని, అందులో చాలా ట్విస్టులున్నాయని చెప్పి షాకిచ్చారు. తను ప్రేమించిన అమ్మాయిని తన ఫ్రెండ్ కూడా లవ్ చేశాడని, ఆ తరువాత విషయం తెలిసి ఇద్దరం గొడవ పడ్డామని, కానీ తాము ప్రేమించిన అమ్మాయి కాలేజీ వదిలి వెళ్లిపోయిందని, ఆ తరువాత ఇద్దరం కలిసి బాధపడ్డామని షాకిచ్చాడు సాయిధరమ్ తేజ్.