కిషోర్ తిరుమల `చిత్రలహరి`, మారుతి రూపొందించిన `ప్రతీరోజు పండగే` చిత్రాలతో సాయిధరమ్తేజ్ మళ్లీ ట్రాక్లోకి వచ్చారు. వరుస హిట్లని సొంతం చేసుకున్న ఆయన అదే జోష్లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడితో `సోలో బ్రతుకే సోబెటర్` చిత్రంలో నటిస్తున్నారు. థియేటర్లు ప్రారంభం అయితే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ రెడీగా వున్నారు.
దేవా కట్టా డైరెక్షన్లో ఓ సినిమాని లాంఛనంగా మొదలుపెట్టారు. అయితే కరోనా వైరస్ కారణంగా రెగ్యులర్ షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు ఏర్పడితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు సాయిధరమ్తేజ్ ఓ పిరియాడిక్ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహించనున్నారట. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కథతో ఈ చిత్రాన్ని పిరియాడిక్ డ్రామాగా తెరపైకి తీసుకురానున్నారట. ఇందులో శ్రీకృష్ణ దేవరాయలుగా సాయిధరమ్తేజ్ కనిపించనున్నారట. అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నట్టు తెలిసింది.