Homeటాప్ స్టోరీస్రిలీజ్ ఆగిపోయిన సాక్ష్యం

రిలీజ్ ఆగిపోయిన సాక్ష్యం

sakshyam movie release delayedబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉండే కానీ భారీ బడ్జెట్ మూలంగా సినిమా రిలీజ్ ఆగిపోయింది . దాంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగతా చోట్ల కూడా సినిమా విడుదల ఆగిపోయింది . శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ” సాక్ష్యం ”. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జస్ట్ అప్ కమింగ్ హీరో అయినప్పటికీ అతడి మీద భారీ బడ్జెట్ లు పెట్టి మరీ సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ సురేష్ . పేరుకి బయటి వాళ్ళు నిర్మాతలు కానీ పెట్టుబడి మాత్రం బెల్లంకొండ దే !

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో జగపతిబాబు నటించాడు . ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన మూడు చిత్రాలు బడ్జెట్ పరంగా డిజాస్టర్ అయ్యాయి అయినా కూడా మళ్ళీ అదే తప్పు చేసారు కట్ చేస్తే సినిమా విడుదల ఆగిపోయింది . ఫైనాన్స్ విషయంలో తేడా రావడంతో ఆ డబ్బు కట్టేంత వరకు సినిమా విడుదల చేయొద్దని లీగల్ నోటీసులు అందాయట దాంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది . టెక్నీకల్ సమస్య అని చెబుతున్నారు కానీ టెక్నీకల్ సమస్య కాదు డబ్బు సమస్య అసలు నిజం . భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తే సినిమాలు హిట్ కావు కానీ కొంతమంది మాత్రం భారీ బడ్జెట్ పెడుతూ డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు చేస్తూ ఇలా అభాసు పాలౌతున్నారు .

- Advertisement -

English Title: saakshyam movie release delayed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All