Homeటాప్ స్టోరీస్సాక్ష్యం కు అప్పుడే ప్లాప్ టాక్

సాక్ష్యం కు అప్పుడే ప్లాప్ టాక్

negetive talk spread on bellamkonda sai srinivas sakshyamబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ” సాక్ష్యం ” చిత్రానికి అప్పుడే ప్లాప్ టాక్ స్ప్రెడ్ అవుతోంది . ఈ సినిమా ఈనెల 27న విడుదల అవుతోంది అయితే సినిమా చూసాం , అంతగా బాగోలేదు అంటూ కొంతమంది అప్పుడే డివైడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు . ఈ సినిమాపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటుగా బెల్లంకొండ సురేష్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తనయుడి ని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టాలని . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం లో పూజా హెగ్డే కథానాయిక కాగా అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించాడు .

భారీ విజువల్స్ ,సాక్ష్యం పై అంచనాలు పెంచేలా చేసింది . ట్రైలర్ కూడా బాగుంది కానీ ఇటీవలే ఈ సినిమా సెన్సార్ ఇబ్బందులను కూడా అధిగమించి రిలీజ్ కి సిద్ధమైంది . మొదటి చిత్రం అల్లుడు శీను చిత్రంతో ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే బడ్జెట్ ఎక్కువ కావడంతో నష్టాలు వచ్చాయి ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు డిజాస్టర్ అయ్యింది . దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక అనే చిత్రం చేసాడు అది కూడా డిజాస్టర్ అయ్యింది . నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి మార్కులే పడ్డాయి కానీ భారీ బడ్జెట్ కావడం వల్ల లాస్ ప్రాజెక్ట్ అయ్యింది , ఇక ఇప్పుడు కూడా సాక్ష్యం సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు . ఆ స్థాయి వసూళ్లు వస్తేనే హిట్ లేకపోతే ప్లాప్ ముద్ర పడుతుంది కానీ ఈలోపుగానే ప్లాప్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All