Homeటాప్ స్టోరీస్అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే!

అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే!

అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే!
అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. దీని కార‌ణంగా ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ తాత్కాలికంగా మూత‌ప‌డ్డాయి. సినీ ఇండస్ట్రీ కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటోంది. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించ‌డం, తాజాగా దాన్ని మే 7 వ‌ర‌కు పొడిగించ‌డంతో రిలీజ్‌కు రెడీగా వున్న సినిమాల ప‌రిస్థితి కొంత ఆందోళ‌న క‌రంగా మారింది.

రోజుకో సినిమాపై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ న‌టించిన `ఓరేయ్ బుజ్జిగా` చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అందులో ఎలాంటి నిజం లేద‌ని నిర్మాత కె.కె. రాధామోహ‌న్ స్ప‌ష్టం చేయ‌డంతో పుకార్ల‌కు బ్రేక్ ప‌డింది. ఆ త‌రువాత రామ్ `రెడ్‌` చిత్రంపై కూడా ఇలాంటి పుకారే రావ‌డంతో రామ్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

- Advertisement -

తాజాగా ఇదే రూమ‌ర్ అనుష్క న‌టించిన `నిశ్శ‌బ్దం` చిత్రంపై మొద‌లైంది. కోన వెంక‌ట్‌, టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని, అయితే ఈ ప్ర‌తి పాద‌న‌కు అనుష్క అంగీకారం తెల‌ప‌డం లేద‌ని పుకార్లు మొద‌ల‌య్యాయి. ఈ పుకార్ల‌లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, అనుష్క‌, కీల‌క న‌టీన‌టులు, చిత్ర బృందం సినిమా ప్రారంభం నుంచి త‌మ‌కు స‌హ‌క‌రిస్తున్నార‌ని, మా చిత్రాన్ని ఎలాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All