Homeటాప్ స్టోరీస్పెళ్లి చూపులు భామకు ఇప్పుడు కలిసొస్తోంది

పెళ్లి చూపులు భామకు ఇప్పుడు కలిసొస్తోంది

పెళ్లి చూపులు భామకు ఇప్పుడు కలిసొస్తోంది
పెళ్లి చూపులు భామకు ఇప్పుడు కలిసొస్తోంది

పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది రీతూ వర్మ. చక్కని అభినయంతో రీతూ వర్మ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి విజయ్ దేవరకొండ రేంజ్ బాగా పెరిగింది. ఆ తర్వాత వరసగా అవకాశాలు రావడంతో విజయ్ బిజీ అయిపోయాడు. వాటిలో కొన్ని హిట్ అవ్వడంతో విజయ్ కు స్టార్ స్టేటస్ కూడా వచ్చేసింది. మరోవైపు రీతూ వర్మకు మాత్రం అవకాశాలు అంతలా రాలేదు. కేశవ సినిమాలో అవకాశం వచ్చినా ఆ చిత్రం అంతలా ఆడకపోవడంతో దానివల్ల ఆమెకు ఒరిగింది సున్నా. అప్పటినుండి రీతూ వర్మ తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇక లాభం లేదనుకుని మధ్యలో వేరే భాషలపై దృష్టి పెట్టింది రీతూ. తమిళంలో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే అదృష్టం ఆమె పక్షాన లేదు. విక్రమ్ సరసన గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలో అవకాశమంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేసి ఒప్పుకుంటుంది. ఎందుకంటే విక్రమ్ సినిమాలు వైవిధ్యానికి మారుపేరు. అందులో హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు దొరుకుతాయి. పైగా గౌతమ్ మీనన్ సినిమాలంటే హీరోయిన్స్ ను అందంగా చూపిస్తాడన్న పేరుంది. పైగా గౌతమ్ మీనన్ కూడా హీరోయిన్లకు బలమైన పాత్రలు రాస్తుంటాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎగిరిగంతేసి ఒప్పుకుంది రీతూ వర్మ. అయితే దురదృష్టం ఆమెను వెంటాడింది. వీరి కాంబినేషన్ లో రూపొందిన ధ్రువ నక్షత్రం సినిమా.షూటింగ్ ఎప్పుడో పూర్తైన ఇంకా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఫైనాన్షియర్ కు గౌతమ్ మీనన్ కు వచ్చిన గొడవ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే సమస్యలు అన్నీ తీరి సినిమా రిలీజ్ త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే రీతూ వర్మ టాలెంట్ ను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇప్పటికే శర్వానంద్ తో కలిసి ఒక ద్విభాషా చిత్రాన్ని చేస్తోంది. అలాగే నాని నటించనున్న తన 26వ చిత్రంలో రీతూ ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కించనున్నాడు. నానితో సినిమా అంటే ఆమెకు తగినంత గుర్తింపు రావడం ఖాయం. ఈ సినిమానే కాకుండా నాగ శౌర్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రంలో రీతూ వర్మ కథానాయికగా ఎంపికైంది. మరోవైపు మలయాళంలో కూడా దుల్కర్ సల్మాన్ సినిమాలో నటిస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. తెలుగు వచ్చిన, నటనకు పేరు పెట్టక్కర్లేకుండా నటించే కథానాయికలు అస్సలు దొరకట్లేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో రీతూ వర్మ వంటి కథానాయికలు రైజ్ అవ్వడం శుభసూచకమే. అయితే రీతూ తనకు వచ్చిన అవకాశాలను అన్నీ ఒప్పేసుకోకుండా ఆచి తూచి తన పాత్రకు సరైన వెయిటేజ్ అంటే కచ్చితంగా ఎస్ చెబుతోంది. లేట్ గా అయినా కూడా ఈ టాలెంటెడ్ బ్యూటీ కి సరైన అవకాశాలు వస్తుండడం సంతోషకరమే. ఇలాగే ఈ బ్యూటీ మరిన్ని అవకాశాలు తెచ్చుకుని దూసుకుపోవలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All