Homeటాప్ స్టోరీస్పెళ్లి చూపులు పిల్ల.. ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

పెళ్లి చూపులు పిల్ల.. ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Pellichoopulu actress rithu varma new movie with naga shourya
Pellichoopulu actress rithu varma new movie with naga shourya

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ బాగా దగ్గరైన బ్యూటీ రీతూ వర్మ. కాస్త గ్లామర్ ఛాయలు కనిపించడంతో అమ్మడు టాలీవుడ్ లో ఇట్టే క్లిక్కవుతుందని అంతా అనుకున్నారు. కానీ అమ్మడు కోలీవుడ్ సైడ్ ఎక్కువగా అడుగులు వేసింది. మధ్యలో కొన్ని తెలుగు ఆఫర్స్ వచ్చినా నో చెప్పిందని గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే బేబీ మాత్రం తనకి నచ్చిన కథలను మాత్రమే చేయడానికి ఒప్పుకుంటానని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీతూ వర్మ మొత్తనికి ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో యువ హీరో నాగ శౌర్య కొత్త సినిమా మొదలుకానుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ లో కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఆ ప్రాజెక్టును తెరకెక్కించనుంది. ఇటీవల స్క్రిప్ట్ విన్న రీతూ సింగిల్ సిట్టింగ్ లో ఒకే చెప్పేసిందట. తెలుగులో చివరగా ఈ భామ నిఖిల్ కేశవ సినిమాలో నటించింది. ఆ సినిమా తరువాత కోలీవుడ్ సైడ్ కి ఎగిరిపోయింది. ఇక మొత్తానికి నాగ శౌర్య సినిమాతో టాలీవుడ్ లో వాలింది.
ఇక కొన్ని రోజుల క్రితం శర్వానంద్ తో కూడా ఒక సినిమాను మొదలుపెట్టింది. ఆ సినిమా పూర్తిగా తమిళ్ టెక్నీషియన్స్ తో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. ఇక ఇప్పుడు నాగ శౌర్య కథకు ఒప్పుకున్న బ్యూటీ మరో రెండు తెలుగు కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు టాక్ వస్తోంది. మరి బేబీ ఈ ప్రాజెక్ట్ లతో తెలుగులో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All