సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మ హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అతనిది ఆత్మ హత్య అని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఇచ్చిన పోలీసులు చెబుతుంటే జరుగుతున్న సంఘటనలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనపిస్తున్నాయి. సుశాంత్ది ఆత్మ హత్య.. లేక హత్యా అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ రోజు రోజుకీ ఓ ట్విస్ట్ బయటికి వస్తోంది. నేపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడని కంగన లాంటి వాళ్లు వాదిస్తుంటే జరుగుతున్న వరుస సంఘటనలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వున్నాయి.
సుశాంత్ తండ్రి రియా చక్రవర్తిని టార్గెట్ చేయడం, అంతకు ముందు ఏం జరిగిందో చెప్పడానికి రియా ముందుకు రాకపోవడం, జేడీయూ నేత రియా విష కన్య అని ఆమె హత్య చేయించిందని సంచలన వ్యాఖ్యలు చేయడం, బీజేపీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి కూడా సుశాంత్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో సుశాంత్ కేసు మరింత జఠిలంగా మారి నెల రోజులు దాటినా సంచనం సృష్టిస్తూనే వుంది. ఇదిలా వుంటే తనపై వస్తున్న ఆరోపణలని కండిస్తూ రియా ఎట్టకేలకు ఓ వీడియో సందేశాన్ని వదిలింది.
సత్యమేవ జయతే అంటూ సత్యమే గెలుస్తుంది..తానేమీ తప్పు చేయలేదనే భావనని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. భగవంతుడిపై, న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం వుందని, ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని, తనపై టీవీ చానల్స్ లో విషపూరితమైన వార్తా కథనాలు వస్తున్నప్పటికీ విషయం కోర్టు పరిథిలో వుంది కాబట్టి లాయర్ల సలహా మేరకు తాను మాట్లాడకూడదని మౌనం వహిస్తున్నానని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.