![రేణుదేశాయ్ డిజిటల్ ఎంట్రీకి రెడీ!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/09/Renu-desai-entaring-digital-world.jpg)
2003లో వచ్చిన `జానీ` తరువాత రేణుదేశాయ్ మళ్లీ తెరపై కనిపించలేదు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తరువాత ఆమె మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నారు. `జానీ` మూవీ తరువాత పవర్స్టార్ పవన్కల్యాణ్ని వివాహం చేసుకున్న ఆమె సినిమాలకు గుడ్బై చెప్పారు. పవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, ఆయన చిత్రాల్లోని కొన్ని పాటలకు ఎడిటర్గా కూడా వ్యవహరించారు కానీ తెరపై కనిపించలేదు. పవన్తో విడిపోయిన తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఆమె కెమెరా ముందుకొస్తున్నారు.
అయితే ముందు డిజిటల్ వరల్డ్లో ఓ వెబ్ సిరీస్ చేసిన తరువాతే సినిమా చేయాబోతున్నారు. ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ `ఆధ్యా`. ఇందులో రేణు దేశాయ్ ఓ కంపనీకి సీఈఓగా కనిపించనున్నారు. శ్రీకృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ని డీఎస్రావుతో కలిసి ఎస్. రజినీ కాంత్ నిర్మిస్తున్నారు.
రేణు దేశాయ్ పాప పేరు ఆధ్యా అన్న విషయం తెలిసిందే. అదే పేరుతో వెబ్ సిరీస్ చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన మరిన్ని వివరాల్ని మేకర్స్ త్వరలోనే అఫీషియల్గా వెల్లడించనున్నట్టు తెలిసింది.