మోడల్గా కెరీర్ ప్రారంభించిన రేణూ దేశాయ్ ఆ తరువాత పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన `బద్రి` సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలోకి `జేమ్స్ పాండు` సినిమాతో పరిచయమైంది. ఇందులో ప్రభుదేవా హీరోగా నటించాడు. ఆ తరువాత తమిళంలో మరో సినిమా చేయలేదు. పవన్కల్యాణ్ ని వివాహం చేసుకున్నాక అతనితో కలిసి `జానీ`లో నటించింది. పవన్ నటించిన ఖుషీ, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ పని చేసింది.
`ఖుషీ` చిత్రంలోని యే మేరా జహా.., బాలు చిత్రంలోని `హట్ హజ్ఞట్ జా… పాటలకు ఎడిటర్ానూ వర్క్ చేసింది. అయితే ఇన్నింటిలో తన టాలెంట్ని ప్రదర్శించిన రేణూ దేశాయ్కి నటి కావాలని అస్సలు లేదట. తను అంతరిక్ష శాస్త్ర వేత్తని కావాలనుకుందట. అదే ఆమె డ్రీమ్ అని చెబుతోంది. అదీ జరక్కపోతే తాను డాక్టర్ కావాలనుకున్నానని కానీ అది కూడా నెరవేరలేదని, ఊహించకుంగానే 18వ ఏట కెమెరా ముందుకొచ్చానని చెప్పుకొచ్చింది.
తను సినిమాల్లోకి ప్రవేశించి 25 ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో రేణూ దేశాయ్ పలు ఆసక్తికర విషయాల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నాసాలో శాస్త్ర వేత్తను కావాలనుకున్నానని ఆ డ్రీమ్ డ్రీమ్గానే మిగిలిపోయిందని చెప్పుకొచ్చింది.