స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ మూవీతో క్రేజీ లేడీ శృతిహాసన్ టాలీవుడ్కి మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. `డాన్శీను`, `బలుపు` వంటి హిట్ చిత్రాల తరువాత గోపీచంద్ మలినేని – మాస్రాజా రవితేజల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే వున్నాయి. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ని సొంతం చేసుకోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన చివరి పాటని రవితేజ, శృతిహాసన్లపై చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రకటించారు. గత ఎనిమిది నెలల తరువాత థియేటర్లు రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో సాయి ధరమ్తేజ్నటించిన `సోలో బ్రతుకే సో బెటర్` ముందుగా ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా విడుదలవుతోంది. దీంతో స్టార్ హీరోలు కూడా తమ సినిమాలని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హీరో రవితేజ నటిస్తున్న `క్రాక్`ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, థియేట్రికల్ ట్రైలర్ని త్వరలో రిలీజ్ చేయబోతున్నామని, ముందు బీజీఎంని మూడో సింగిల్ని రిలీజ్ చేయబోతున్నట్టు తమన్ వెల్లడించారు. ఇదే ట్వీట్ని రీట్వీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని క్రాక్ ఆన్ 14 అనే హ్యాష్ ట్యాగ్ని ట్వీట్ చేయడంతో ఈ మూవీ సంక్రాంతి రిలీజ్పై క్లారిటీ వచ్చేసింది.