మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ చివరి సాంగ్ షూట్ ఇటీవల గోవాలో పూర్తయింది. ఈ మూవీ పూర్తవడంతో రవితేజ తన తదుపరి చిత్రం `ఖిలాడీ`సెట్లోకి వెళ్లిపోయారు. రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ బాలీవుడ్ మేకర్స్ పెన్ స్టూడియోస్, జయంతిలాల్ గడతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ప్లే స్మార్ట్` అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్.
మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోని దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రవితేజ మార్కు చిత్రాలకు కొంచెం భిన్నంగా ఈ మూవీని దర్శకుడు రమేష్వర్మ ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో విలన్గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి విలన్ పాత్రకు సంబంధించి మాత్రం క్లారిటీ రావాల్సి వుంది.