మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం `క్రాక్`. ఇటీవల వరుస ఫ్లాపుల్లో వున్న రవితేజ ఈ సినిమాలె తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్నపట్టుదలతో వున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆడిపోయిన సినిమా షూటింగ్లన్నీ తిరిగి ప్రారంభం అవుతున్నాయి.
ఈ క్రమంలో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్` షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. కోవిడ్ నిబంధనలని అనుసరించి ధర్మల్ స్క్రీనింగ్ , సెట్లో శానిటైజేషన్, మాస్కులు వంటి నిబంధనలు, జాగ్రత్తల్ని పాటిస్తూ ఈ మూవీ షూట్ని చేస్తున్నారు.
దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. లైట్ బాయ్ దగ్గరి నుంచి ప్రధాన టెక్నీషియన్స్, హీరో రవితేజ వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. రవితేజ స్టేషన్కి సంబంధించిన సీన్లని షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మేకింగ్ వీడియో చివరలో `స్టేషన్లో వున్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం నేర్చుకో` అంటూ హీరో రవితేజ చెబుతున్న డైలాగ్ ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా వుండబోతుదో తెలియజేస్తోంది.