Homeగాసిప్స్సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది?

సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది?

సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది?
సుక్కూ, రత్నవేలుకు మధ్య ఏం జరిగింది?

సుకుమార్, రత్నవేలుది డెడ్లి కాంబినేషన్. ఆర్య నుండి మొదలైన వీళ్ళ బంధం రంగస్థలం దాకా కొనసాగింది. సుక్కూ దర్శకత్వంలో రత్నవేలు కెమెరా వర్క్ తో దేవి శ్రీ ప్రసాద్ పాటలు.. ఇంతకంటే సూపర్ హిట్ కాంబినేషన్ ఉంటుందా అన్నట్లు సాగింది వీళ్ళ జోడి. అయితే ప్రస్తుతం లెక్క తారుమారైంది. సుకుమార్ సినిమాకు ఇన్నాళ్లూ పనిచేస్తూ వచ్చిన రత్నవేలు ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాకు పనిచేయట్లేదు. రత్నవేలు కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, మరి ఎందుకు సుకుమార్ రత్నవేలును పక్కనపెట్టి విదేశీ సినిమాటోగ్రాఫర్ ను పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకని సుకుమార్ ఇలా చేసాడు? అంటే దానికి రీజనింగ్ లేకపోలేదు.

రత్నవేలు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అతని క్యాలెండరు అసలు ఖాళీగా లేదు. సరిలేరు నీకెవ్వరు, ఇండియన్ 2 చిత్రాలతో రత్నవేలు చాలా బిజీగా ఉన్నాడు. కేవలం బిజీగా ఉన్న కారణంగానే రత్నవేలు సినిమా చేయట్లేదని అందుకు మించి ఏమి లేదని తెలుస్తోంది. అందుకే రత్నవేలు – సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ త్రయం ఈ సినిమా వరకూ విడిపోయింది. అల్లు అర్జున్ ఆరు నెలల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని చెప్పడంతో ఒక డెడికేటెడ్ కెమెరా మ్యాన్ ఉంటే బెటర్ అని, గ్యాంగ్ లీడర్ చిత్రానికి డిఓపిగా చేసిన కూబాను ఈ చిత్రానికి తీసుకున్నారు.

- Advertisement -

రత్నవేలు ఈ సినిమా టీమ్ ను మిస్సవుతున్నట్లు ట్వీట్ కూడా చేసాడు. డియర్ ఆర్య సుక్కూ ఈసారికి ఒకరినొకరు మిస్సవుతున్నాం. రంగస్థలం చిత్రంలానే ఇది కూడా కల్ట్ క్లాసిక్ అవ్వాలని కోరుకుంటున్నా, టీమ్ అంతటికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. మొత్తానికి ఈ ట్వీట్ వల్ల ఒక విషయం అయితే అర్ధమైంది. అల్లు అర్జున్ – సుకుమార్ కలిసి మరో కల్ట్ క్లాసిక్ ను అందించబోతున్నారు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంతకు మించిన ఆనందం వేరొకటి ఉంటుందా!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All