రష్మిక మందన్న.. టాలీవుడ్లో ప్రస్తుతం ఈ పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కన్నడ హిట్ చిత్రం `కర్రాక్ పార్టీ`తో ఒక్కసారిగా పాపులర్ అయిన రష్మిక ఆ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లని సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.
ప్రస్తుతం తమిళంలో కార్తీతో `సల్తాన్`, తెలుగులో అల్లు అర్జున్తో `పుష్ప` చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వుంది. గత కొన్ని రోజులుగా చిత్తూరు యాసపై పట్టు సాధించేందుకు కసరత్తులు చేస్తున్న రష్మికని ఓ అభిమాని మిమ్మల్ని పెళ్లాడాలంటే ఏం చేయాలని అడిగాడట. ఈ విషయాన్ని కూల్గా బయటపెట్టిన రష్మిక అంతే కూల్గా అభిమానికి సమాధానం చెప్పింది. తనని పెళ్లాడాలంటే ఏం చేయాలని ఓ వ్యక్తి నన్ను అడిగాడు. ఆ ఆలోచన వుంటే ముందు నన్ను కలవాలని, ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందామని, ప్రొసీజర్ ఏంటనేది అప్పుడు తాను చెబుతానని, తనని ఎలా కలవాలో తన టీమ్ని అడిగితే తెలుస్తుందని
ఓపిగ్గా సమాధానం చెప్పిందట.
స్టార్ హీరోయిన్ అయివుండి కూడా ఏ మాత్రం గర్వం లేకుండా చాలా కూల్గా అభిమానికి రష్మిక సమాధానం చెప్పడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఆమె సమయ స్పూర్తి, పేషెంట్స్కి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నట్టు రష్మిక `పుష్ప`లో పల్లెటూరి యువతిగా కనిపించబోతోంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.