![బన్నీ `పుష్ప` టీమ్కి ఆన్లైన్ కష్టాలు! బన్నీ `పుష్ప` టీమ్కి ఆన్లైన్ కష్టాలు!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/09/Bunny-Pushapa-team-join-for-online-clasess.jpg)
కరోనా కారణంగా స్కూల్ తెరవడం ఈ ఏడాది కష్టమే. ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరం వేస్ కాకూడదనే ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్లకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో తల్లిదండ్రులకు ఆన్ లైన్ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇదే తరహా ఆన్లైన్ కష్టాల్లో వుంది `పుష్ప` టీమ్. `అల వైకుంఠపురములో` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత బన్నీ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
ముత్యం శెట్టి మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్గా పక్కా గ్రామీణ యువతిగా కనిపించబోతోంది. శేషాచలం అడవుల్లో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రా ఎంటర్టైనర్గా పక్కా మాసీవ్ లుక్స్తో రూపొందించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. దీని కోసం సైలెంట్గా బన్నీ లొకేషన్స్ హంట్ చేస్తున్నారు. ఇటీవల అదిలాబాద్ కుంతాల జలపాతం పరిసరాలని పరిశీలించిన బన్నీ మహారాష్ట్రలోని అడవులని కూడా పరిశీలించినట్టు తెలిసింది.
ఇదిలా వుంటే ఇందులో హీరోతో పాటు మిగతా ప్రధాన పాత్రలన్నీ చిత్తూరు యాస మాట్లాడతాయంట. ఇందు కోసం ప్రస్తుతం వీరికి ఓ మాస్టర్ సహాయంతో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారట. భాష, డిక్షన్పై పట్టు సాధించడానికి కీలక నటీనటులతో పాటు బన్నీ, రష్మిక కూడా కుస్తీ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్రాజ్, జగపతిబాబు, అనసూయ, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.